కరీంనగర్ జిల్లా: ఈనెల 29న హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సిపిఎస్ విధానంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు టి.సి.పి.ఎస్.ఇ.ఏ రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల కృష్ణ కుమార్, ప్రధాన కార్యదర్శి హనుమండ్ల భాస్కర్ లు తెలిపారు, తెలంగాణ రాష్ట్ర లోని సుమారు 1,70,000 మంది సిపిఎస్ ఉద్యోగులు పెన్షన్ సౌకర్యం లేక భవిష్యత్తు కోసం భద్రత కరువై ఆందోళన చెందుతున్నారు, సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని. రౌండ్ టేబుల్ సమావేశం కు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు మేధావులు హాజరవుతున్నారని, సిపిఎస్ ఉద్యోగులు అధిక సంఖ్యలో రౌండ్ టేబుల్ సమావేశం ను విజయవంతం చేయాలని కోరారు.
