- త్వరితగతన అభివృద్ధి పనులు
- అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
సంగారెడ్డి – అమీన్ పూర్ : నిర్దేశించిన లక్ష్యంలోగా అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధికారులను ఆదేశించారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నరేంద్ర నగర్ కాలనీ అబ్దుల్ కలాం హోమ్స్ లో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన 25 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, జగదీశ్వర్, కాలనీవాసులు పాల్గొన్నారు.