- తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక వ్యవసాయ బీమా ప్రవేశపెట్టాలి..
- బిజెపి జాతీయ నాయకులు సుగుణాకర్ రావు..
కరీంనగర్ జిల్లా: పట్టణంలోని మీడియా సమావేశంలో బిజెపి జాతీయ నాయకులు సుగుణాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రైతులకు పంట నష్టం జరిగిందని మండిపడ్డారు. అకాల వర్షాలతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన టైంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతోనే పంట నష్టం జరిగినట్లు ఆరోపించారు. ధాన్యం చేతికొచ్చే సమయానికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్రంలో అమలు చేయకపోవడంతోనే రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధీమా కలిగించే బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 30 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మరియు మే 6, 2023 శనివారం రోజున కొండగట్టు క్షేత్ర సమగ్ర అభివృద్ధికై, సర్వజన సంక్షేమానికై కొండగట్టులో నిర్వహించబోయే శ్రీ రామ నామ మహా యజ్ఞం యొక్క పోస్టర్ ను బిజెపి జాతీయ నాయకులు, కొండగట్టు ఆంజనేయ దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పొల్సాని సుగుణాకర్ రావు ఆవిష్కరించారు.