కరీంనగర్ జిల్లా: అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను తడిసన వరి ధాన్యం కేంద్రాలను రైతులు,కాంగ్రెస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ శంకరపట్నం మండలంలో పరిశీలించారు, చింతగుట్ట గ్రామంలో కౌలు రైతు అరుగాలం కష్టపడి పండించిన పంట దెబ్బ తినడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, తాడికల్ గ్రామంలో రైతులు వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్న ఐకేపీ కేంద్రంలో నేటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదు అన్నారు, స్థానిక ఎమ్మెల్యే అధికారులు వచ్చి రిబ్బన్ కట్ చేసి ఫోటోలు దిగి వెళ్లారు తప్ప ఇప్పటివరకు ఒక కిలో ధాన్యం కూడా కొనుగులు చేయలేదన్నారు, ట్రాక్టర్లు లేక కొనుగోలు చేయడం లేదని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, స్థానిక అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే తడిసిన వరి ధాన్యన్ని ఎటువంటి తరుగు తీయకుండా వెంటనే కొనుగోలు చేయాలని పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలని కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు అనంతరం కేశవపట్నం,ముత్తారం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ. పరామర్శించారు.
