- ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది
- ఎం ఆర్ పి ఎం రాష్ట్ర కార్యదర్శి పెద్ద గీత
- ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం సరికాదు సి పి యం నాయకులు
సంగారెడ్డి ఏప్రిల్ :ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యే మంత్రులను.. శాసనసభ్యులను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిందని.. దాన్ని పోలీసులు ఉల్లంఘిస్తూ అధికార పార్టీ నేతలతో పాటు మంత్రుల మెప్పు పొందేందుకు ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గీత ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లాలో శనివారం మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి, మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంది గ్రామానికి చెందిన గీత ఇంటికి వెళ్లి సంగారెడ్డి రూరల్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం పై ఆమె తీవ్రంగా స్పందించారు. ఆమెతో పాటు సదాశివపేట ఏరియా కార్యదర్శి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి. ప్రవీణ్ కుమార్ తో పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం సంగారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక రకాల హామీలు ఇచ్చి నేడు ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది. పేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రజల కు ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు శాంతియుత వాతావరణంలో ఉద్యమాలు చేస్తుంటే తమను అక్రమంగా చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే వారిపై పోలీసులను పెట్టి ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని నిర్బంధించాలని కోవడం సరికాదు. ప్రభుత్వం తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ప్రశ్నించే వారిపై అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సరికాదు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని సిపిఎం హెచ్చరిస్తుంది. అరెస్టులు నిర్బంధాలు ప్రజల పోరాటాలను ఆపలేవని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి గీతా తో పాటు సిపిఎం నాయకులుహెచ్చరించారు