మంచిర్యాల జిల్లా : చెన్నూరు మండలంలోని చింతలపల్లి గ్రామ సమీపంలోని బతుకమ్మ వాగు వంతెనపై భారీ ముప్పు పొంచి ఉంది. వర్షాకాలం కావడంతో కొద్ది రోజులుగా కురుస్తున్న మాములు వర్షాలకే పగుల్లు తేలుతున్నాయని. వాహనదారులు తీవ్ర భయందోళనకు గురువుతున్నారు. గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు భారీ వరదలు రాగా, అదే వంతెన అప్రోచ్ రోడ్ దాదాపు పది మీటర్ల మేర తెగిపోయి, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ కు వెళ్లే నేషనల్ హైవే పై చాలా రోజులు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ పరిస్థితిని ఇక్కడి స్థానికుల ద్వారా తెలుసుకున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెంటనే స్థానిక నాయకులను ఆదేశించి, తాత్కాలిక రోడ్డు వేయించి, రాకపోకలు సజావుగా సాగేలా కృషి చేశారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భారీ ప్రమాదం పొంచి ఉందని, రానున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని, అధికారులు వెంటనే స్పందించి, అప్రోచ్ రోడ్డు మరమ్మత్తులు చేసి, శాశ్వత పరిస్కారం చేయాలని స్థానిక ప్రజలు, నాయకులు కోరుతున్నారు.
