contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కారంపూడి – నల్లమల అడవి ప్రాంతంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పర్యటన

  • కారంపూడి వద్ద నల్లమల అడవి ప్రాంతంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పర్యటన
  • ప్రకృతి ప్రియుడు కోమెర. అంకారావు (జాజి ) తో కలిసి కోటి విత్తనాలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లోతేటి శివశంకర్
  • పర్యావరణం పై అంకారావు చేస్తున్న కృషిని అభినందించిన కలెక్టర్
  • ప్రతిఒక్కరు కోమెర.అంకారావు (జాజి ) ను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు కలెక్టర్ పిలుపు

పల్నాడు జిల్లా కారంపూడి : పర్యావరణాన్ని రక్షించవలసిన బాధ్యత మనందరి పై ఉందని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి. శివశంకర్ అన్నారు. ఆదివారం ప్రకృతి ప్రియుడు కోమెర. అంకారావు (జాజి ) ఏర్పాటు చేసిన కోటి విత్తనాలు నాటే కార్యక్రమం కారంపూడి వద్ద గల నల్లమల్ల అటవీ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమనికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సహజంగా మొక్కల గురించి మనం పుస్తకాల ద్వారా తెలుసుకుంటామని కాని పల్నాడు ప్రాంతానికి చెందిన కోమెర. అంకారావు మొక్కల పై అధ్యయనం చేసి వాటి గురించి విద్యార్థులకు వివరిస్తూ పర్యావరణం పై ఆయన చేస్తున్న కార్యక్రమలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ అన్నారు. అడవిలో మొక్కలు పెంచలనే ఉద్దేశంతో జాజి చేపడుతున్న కార్యక్రమం గొప్పదని అయన అన్నారు. నేటి యువత కోమెర. అంకారావు ను ఆదర్శంగా తీసుకొని పర్యావరణన్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఒకేసారి కోటి విత్తనాలు నాటడం అనే కార్యక్రమం ఎంతో కష్టం అయినప్పటికీ కోమెర. అంకారావు కృషితో అది సాధ్యమైందని అయన అన్నారు. అడవిలో ఉండే ప్రతిఒక్క మొక్క ఔషాదానికి ఉపయోగపడుతుందని మనకు తెలియని విషయాలు కూడా అంకారావు తెలుసుకొని భవితరాలకు మొక్కల గురించి చాటి చెప్పలనే ఉద్దేశం ఈ మహోత్తర కార్యక్రమన్ని అయన ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమంలో తనను కూడా భాగస్వామ్యం చేయటం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. అనంతరం పర్యావరణం మొక్కల పెంపకం పై కస్తూరిభాయి పాఠశాలకు చెందిన విద్యార్థినిలతో కలెక్టర్ కొద్దీసేపు ముచ్చటించి మొక్కల పెంపకం గురించి వారికీ వివరించారు. అనంతరం కోమెర. అంకారావు తో కలిసి నల్లమల అడవి ప్రాంతంలో విత్తనలను చల్లడం జరిగింది. అనంతరం పక్షులకు అవసరమైన ఆహార విత్తనాలను కూడా ఈ సందర్బంగా కలెక్టర్ చల్లారు. అనంతరం కోమెర. అంకారావును జిల్లా కలెక్టర్ శివశంకర్ దుస్సాలువతో ఘనంగా సత్కరించి అంకారావు ఇంటిని సందర్శించి కుటుంబసభ్యులతో కొద్దీసేపు చర్చించి యాభై వేల నగదును అందించారు. ముందుగా కారంపూడి చేరుకున్న కలెక్టర్ లోతేటి. శివశంకర్ మంత్రాలమ్మతల్లి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కారంపూడి మండలనికి చెందిన అధికారులు కలెక్టర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పి హెచ్ సి వైద్యశాలకు చేరుకొని అదనపు ఆరోగ్య కేంద్ర నూతన బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అయన పరిశీలించి స్థలన్ని పి హెచ్ సి కి కేటాయించేలా చర్యలు చేపట్టాలని తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పర్యటన సందర్బంగా కారంపూడి సిఐ దార్ల. జయకుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ రామాంజనేయులు పటిష్ట బందోబస్త్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి. శ్రీనివాస్ యాదవ్, ఎంపీడిఓ శ్రీనివాసరెడ్డి, పి.హెచ్. సి వైద్యఅధికారి దుర్గరావు, పంచాయతీ విస్తరణ అధికారి సత్యప్రసాద్, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :