కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫిస్ వద్ద మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు సీపీఐ మండల నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం వారు కార్మికులను ఉదేశించి మాట్లాడుతూ జీవో నెం8 అమలు చేసి పెండింగ్ బకాయిలను చెల్లించాలి. అదేవిదంగా కేరళ రాష్ట్రం తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వంట పాత్రలు కోడిగుడ్లు వంట గ్యాస్ పప్పులు నూనె చింతపండు తదితర వంట వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు ఒకపక్క నిత్యావసర ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతున్నాయ్ మరోపక్క స్కూల్స్ ప్రారంభమై ఫీజులు కట్టలేక రెక్కాడితే డొక్కాడని కార్మికులు ఏలా పనులు చేయాలని అన్నారు. కనీస పనికి కనీస వేతనం మినిమం రూ. 26 వేల ప్రభుత్వం వారికి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు అనంతరం మధ్యాహ్నం భోజన వంట కార్మికులు తో కలిసి తహసీల్దార్ కి వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి, మండల సహాయ కార్యదర్శి చొక్కల శ్రీశైలం,మధ్యాహ్నం భోజన వంట కార్మికులు సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి విజయలక్ష్మి, కార్యదర్శి ఏడుమేకల రేణుక, గంగిపల్లి కనుకవ్వ, కుసుమ కవిత, మీడిదొడ్డి విజయ,బోయిని మల్లయ్య,పబ్బతి సాగర్ రెడ్డి, మధ్యాహ్నం భోజన కార్మికులు పాల్గొన్నారు
