పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో 200 ఎకరాలు విస్తీర్ణం గల చెరువులో దానిలో కొంత భాగం మంచినీటి చెరువు ఉంది. అందులో అధికార పార్టీ నాయకుల అక్రమ మైనింగ్ జోరుగా సాగుతుంది. అడ్డగోలుగా గుంతలు వత్తుకుంటూ వెళ్లిపోతున్నారు. రెవెన్యూ, స్థానిక వీఆర్వోల ఆనదండలతో ఈ వ్యాపారం జోరుగా సాగుతుందని ఆరోపణలు లేకపోలేదు. మట్టి మాయగాళ్ళు చెరువులను తవ్వేతప్ప్పుడు స్థానిక విఆర్వో , మండల ఎమ్మార్వో కి సమాచారం ఇస్తే వారే నేరుగా మట్టి మాఫియాకి ఫలానా వాడు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నాడని స్థానిక మట్టి మాఫియాకి సమాచారం ఇచ్చి జర్నలిస్టుల పై దాడులకు కారణమతున్నారు. జానపాడు రిపోర్టర్ ఏడుకొండలు పై దాడి కూడా జరిగింది. పరోక్షంగా అధికారులే క్రైమ్ కి పాలుపడుతున్నారు. ముడుపులు తీసుకుని చూసి చూడనట్టు ఉంటున్నారా ? అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా గుంతలు తవ్వటం వలన ఆ చెరువులో పసి పిల్లలు పడి చనిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ? ఈ విషయం పై జిల్లా కలెక్టర్ కూడా మవునం గా ఉండడం ఎన్నో ప్రశ్నలకు దారి తీస్తుంది. ఇకనయినా ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
