contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ కుమార్ సస్పెండ్

DSP Praneet Kumar Suspension in Call Tapping Case : కాల్​ ట్యాపింగ్​(Cal Tapping Case) వ్యవహారంలో సస్పెండ్​ అయిన ఎస్​ఐబీ డీఎస్పీ ప్రణీత్​ కుమార్​ సస్పెన్షన్​ ఆర్డర్​లో కీలక విషయాలు పేర్కొన్నారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో డీఎస్పీగా పని చేస్తున్న ప్రణీత్​ గతంలో హైదరాబాద్​ ఎస్​ఐబీలో పని చేస్తున్న సమయంలో తన హోదాను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తించారు.

తన ఎస్​ఓటీ బృందం కోసం హైదరాబాద్​ ఎస్​ఐబీ కార్యాలయంలో ప్రత్యేక ఇంటర్నెట్​ సదుపాయాన్ని ప్రణీత్​ ఏర్పాటు చేసుకున్నట్లు సస్పెన్షన్​ ఆర్డర్​లో ఉన్నాయి. ఈ తతంగమంతా తానే నడిపినట్లు అధికారులు తేల్చారు.  ఈ క్రమంలోనే 42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు ఐఎంఈ నెంబర్లు ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రీషియన్​ సాయంతో ఎస్​ఐబీ భవనంలో సీసీ కెమెరాలు(CC Camera) ఆఫ్​ చేయించి హార్ట్​ డిస్కులు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. కాగా విచారణ పూర్తయ్యే వరకూ అనుమతి లేకుండా డీఎస్పీ ప్రణీత్​ హెడ్​ క్వార్టర్స్​ను వీడకూడదని సస్పెన్షన్​ ఆర్డర్​లో పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :