కరీంనగర్ జిల్లా: అపురూపమైన ఆ రోజులెంతో అమూల్యమైనవి..18 వసంతాల వెనుక దాగిన ఆత్మీయత నేడు ఆహ్వానిస్తోంది. స్నేహపరిమళాలతో ఆనందంగా పసి ప్రాయపు జీవన ఉషోదయపు వాకిళ్ళలో జ్ఞాన బీజాలెన్నో చల్లుతూ అక్షరాల ఆలింగనంతో నిత్యం ప్రకాశించే ఈ జ్యోతులకు కుసుమ వందనాలు. చిన్ననాటి స్నేహితులు.. ఒకేచోట చదువుకుని పదో తరగతి పూర్తయ్యాక కొంత మంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, రాజకీయ ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. గన్నేరువరం మండలకేంద్రంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు 2006- 2007 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గన్నేరువరం మండల కేంద్రం శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరుపుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. ఉపాధ్యాయులు కలిసి సరస్వతి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు మెమొంట్ ఇచ్చి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న విద్యార్థులు, మరియు ఉపాధ్యాయులు పాఠశాలలో కలసి తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు. తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు తమపిల్లలు చదువుల గురించి వివరాలు చెప్పుకుంటు ఎంతో ఆనందోత్సాహాలతో గడిపారు. అనంతరం తోటి విద్యార్థులు వివిధ రకాలుగా మరణించడంతో రెండు నిమిషాలు ఉపాధ్యాయులతో మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రిటైర్డ్ హెచ్ఎం మాధవరెడ్డి, లక్ష్మయ్య,పిఈటీ సంపత్ రావు, తిరుపతి రెడ్డి, అబ్దుల్ బాసిక్, లక్ష్మీనారాయణ చారి, టైపిస్ట్ రామస్వామి, శ్రీమన్ రావు, మల్లేశం, విద్యార్థులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి,బుర్ర రాజ్ కోటి గౌడ్,మహేందర్ రెడ్డి,నక్క తిరుపతి, తిప్పర్తి పరిపూర్ణ చారి, సంజువ్,జీవన్, రాపోలు వెంకటేష్,డి. అజయ్, ఎం.మధు,బుర్ర శ్రీకర్ గౌడ్,కూన రమాదేవి,శ్రీయత, శ్రీవాని, సంగీత,సాగరిక,సరితా,మమత,నవిత,స్రవంతి,లత,సమత, సంతోషిని,శారద పూర్వ తోటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.