contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ముఖ్యమంత్రి సహాయం నిధి చెక్కులను పంపిణీ చేసిన ఆవుల రాజిరెడ్డి

నర్సాపూర్, మెదక్ జిల్లా – నర్సాపూర్ పట్టణంలోని ఆవుల రాజిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కులను 40 మందికి మొత్తం 18,35,400 రూపాయల చెక్కులను అందజేసినట్లు పిసిసి ప్రధాన కార్యదర్శి మరియు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల సమస్యలను పరిష్కరించేందుకు, వారికి అవసరమైన సహాయం అందించడానికి ప్రతిష్టాత్మకంగా ఉంది” అని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు ఈ సూచనలను స్వాగతించారు మరియు అవసరమైనప్పుడు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :