అనంతపురం జిల్లా గుత్తి తహసీల్దార్ కార్యాలయానికి ఐఎస్ఓ గుర్తింపు లభించిందని తహసీల్దార్ ఓబులేసు తెలిపారు. ఈ ఐఎస్ఓ గుర్తింపు పత్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా కలెక్టర్ కార్యాలయంలో అందుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు. గుత్తి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు వివిధ సౌకర్యాలు కల్పించడం, పని వేళల బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రశాంత వాతావరణం ఉండటంతో ఈ గుర్తింపు లభించడం ఎంతో హర్షనీయమన్నారు. ఈ గుర్తింపు రావటంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.
