విజయనగర్ జిల్లా : జిల్లా కేంద్రంలో 108 ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు యనమల అప్పలనాయుడు, జిల్లా కార్యదర్శి బోనాల వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా 108 నిర్వహణ సంస్థలు మారుతున్నాయని, ఈ సందర్భంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్జిత సెలవులు, గ్రాడ్యుటి, పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లిం చకుండా ఎగ్గొడుతూ ఉద్యోగులకు నష్టం చేస్తున్నాయని అన్నారు. అంబులెన్సు మరమ్మతుల ఖర్చులను ఉద్యోగుల జీతాల నుంచి కోత పెడుతున్నారని, సరిపడా సిబ్బంది లేక సెలవులు మంజూ రు చేయకుండా ఉద్యోగి యొక్క వ్యక్తిగత జీవితాన్ని హరిస్తున్నా రన్నారు. రోజుకు 12 గంటలు పని చేయించుకుంటూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ అదనపు పనికి అదనపు వేతనం చెల్లించడం లేదని అన్నారు. వీటిపై ప్రభుత్వ ఉన్నత అధికా రులకు అనేక దఫాలుగా వినతిపత్రాలు సమర్పించినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో దీక్ష చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. 108 వ్యవ స్థను ప్రభుత్వమే నిర్వహించి, ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ బిల్లులు, వేతనాలు ఆర్థిత సెలవులకు అరవింద సంస్థ నుంచి ఉద్యోగులకు చెల్లించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్ల నుంచి బకాయి పెట్టిన 40 శాతం ఇంక్రిమెంట్ చెల్లించాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని 108 వ్యవస్థలో అమలు చేయాలని, ప్రభుత్వ నియామకాల్లో 108 ఉద్యోగులకు వేయిటేజీ కల్పించాలని, వేతనాల స్లాబ్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, ప్రతీనెలా 5 వతేది లోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది పాల్గొన్నారు.
