పిఠాపురం : మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారేం శివాజీ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి ఖండవిల్లి లోవరాజు, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ లు ఆ వేడుకకు హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, శాలువ కప్పి, పూలమాలలు వేసి, కేకును తినిపించారు. క్రిస్మస్ సంధర్భంగా క్రిస్మస్ శుభాకంక్షలు కూడా తెలిపారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల కొరకు కారెం శివాజీ కష్టించి పని చేశారని, అటువంటి వ్యక్తి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తీరగటి శివ, మాల మహానాడు రాష్ట్ర యువజన అధ్యక్షుడు నీలం నాగేంద్రప్రసాద్, పురుషోత్తం శ్రీకాంత్, వీరు, బీసీ నాయకులు అందే వీరబాబు, యాండ్ర ఆనంద్ విష్ణుకుమార్, అంబేద్కర్ యూత్ సభ్యులు బల్లా నవీన్, బర్రె పవన్, బత్తిన నవజీవన్ తదితరులు ఆయనను కలిసి పుష్పగుచ్చమ్ అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
