తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో సి.ఐ మద్దయ్యాచారి మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా పాకాల సి.ఐ మద్దయ్యాచారి మాట్లాడుతూ పాకాల టౌన్ లో జరుగుతున్న వరస దొంగతనాల చేదన కొరకు జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాలతో చంద్రగిరి డి.ఎస్.పి బేతపూడి ప్రసాద్ సూచనల మేర నిఘా వ్యవస్థను బలోపేత పరిచి ఏర్పాటు చేశామని అన్నారు.
24వ తేదీ మంగళవారం సాయంత్రం 4:30 గంటల మధ్య పాకాల రైల్వే స్టేషన్ ముందర అనుమానితుడిగా తిరుగుతుండగా విచారించి అరెస్టు చేయడమైనదని తెలిపారు.ఇతను సి.పి.శ్రీనివాసులు(41),సన్నాఫ్ సి.పి.రాఘవయ్య,రామారావు కాలనీ,మదనపల్లి,అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిపారు.చిత్తూరు,కదిరి,మదనపల్లి లలో గత పది సంవత్సరాల నుండి తప్పించుకుని తిరుగుతున్న పాత నేరస్తుడని పేర్కొన్నారు.
గతంలో ఇతను పై కడప,చిత్తూరు,తిరుపతి,అనంతపూర్ జిల్లాల పరిధి పోలీస్ స్టేషన్ లలో 20 కేసులు వరకు ఉన్నాయని తెలిపారు.పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై మూడు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.ఇతని వద్ద నుండి 117 గ్రాముల బంగారు ఆవరణములు,40 వేల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ పంపించామని చెప్పారు.కరుడుగట్టిన నేరస్తుడిని చాకచక్యంగా హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథ్,సోమశేఖర్,చలపతి,కానిస్టేబుల్ మునిశేఖర్ బాబు,విష్ణు ప్రసాద్ లు పట్టుకున్నారు.వీరికి పాకాల సి.ఐ కె.మద్దయ్యాచారి అభినందనలు తెలియజేశారు.కార్యక్రమంలో రవి,కులశేఖర్,సరస్వతి,గౌరీ శంకర్,తులసి,మహేష్,బుజ్జి,పోలీస్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు