తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం లోని పాకాల,చంద్రగిరి, ఎర్రావారిపాళ్యం,తిరుపతి రూరల్,చిన్నగొట్టిగల్లు,రామచంద్రపురం మండలాలలో ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటి,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.పాకాల మండలంలో టిడిపి మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు,మహిళా నాయకురాళ్ళ సమక్షంలో నిర్వహించారు.
ముందుగా టిడిపి మహిళా నేత పులివర్తి సుధారెడ్డి కి ఎన్డీఏ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికి,శ్యాలువా కప్పి సన్మానించారు.అందరికి అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పులివర్తి సుధా రెడ్డి పాకాల జడ్పిటిసి నంగా పద్మజాబాబు రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు.మంత్రి నారా లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రోగులకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బోయపాటి అధ్యక్షుడు నాగరాజు నాయుడు,కార్యదర్శి పల్గుణ కుమార్,పట్టణ అధ్యక్షుడు డి.మోహన్ నాయుడు, కనకరాజు,చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సావిత్రి,మాజీ ఎంపీపీ చాముండేశ్వరి, మాజీ జడ్పిటిసి విజయలక్ష్మి, అనంతనేని బాలాజీ, మందలపు వెంకటేష్ బాబు,రావిళ్ళ మోహన్,డేవిడ్ సురేష్,అరుణ,బుల్లి, ఈశ్వర్ చౌదరి,మధు నాయుడు, అనంతనేని మోహన్ నాయుడు,కె.సురేష్, వాణి ప్రసాద్, రెడ్డి ప్రసాద్,నరసింహులు,ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.