తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పెద్ద రామాపురం పంచాయతీ చిగరపల్లిలో ప్రభుత్వ ఉచిత పశు వైద్య శిబిరం గురువారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతనేని బాలాజీ నాయుడు,బుల్లి,మోహనకృష్ణలు విచ్చేశారు.గ్రామంలో ఉన్నటువంటి పశువులకు పిడుదుల మందు పిచికారి చేయడం జరిగింది.మేకలకు,దూడలకు,పశువులకు నట్టల నివారణ మందు తాగించడం జరిగింది.ముఖ్యంగా గర్భకోశ వ్యాధులకు చికిత్స చేశారు.అనంతరం పశువులకు ఉచిత మందులు అనంతనేని బాలాజీ నాయుడు,బుల్లి,మోహనకృష్ణల చేతుల మీదుగా పంపిణీ చేశారు.పశువులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్,హిమబిందు,ఎన్డీఏ కూటమి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
