అనంతపురం జిల్లాగుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం బస్నేపల్లి గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరియు టిడిపి గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆధ్వర్యంలో, బసినేపల్లి టీడీపీ నాయకుల సమక్షంలో శాసనసభ్యులు స్వగ్రామం అయిన గుమ్మనూరులోని తననివాసం వద్ద టిడిపి లోకి చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ బలోపేతానికి ఇంక ముందు కూడా మరిన్ని చేరికలు ఉంటాయని కచ్చితంగా టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని తెలిపారు. పార్టీలో చేరిన కార్యకర్తలు నియోజకవర్గంలో గుమ్మనూరు కుటుంబీకులు కార్యకర్తల పట్ల చూపిస్తున్న అభిమానానికి టిడిపి
పార్టీ లో చేరడం జరిగిందని తెలిపారు. పార్టీ చేరికలు పాల్గొన్నవారు మస్తాన్ వలి, హస్సేన్, చాంద్ బాషా, అమీద్ బాషా, అంగడి క్రిష్ణ మూర్తి, అంగడి రామకృష్ణ, అంగడి రామాంజినేయులు, అంగడి వెంకటరాముడు, జగన్నాధం,లక్ష్మి నారాయణ, B.సూరి, విజయ్ .
