అనంతపురం జిల్లా గుత్తి మండల తాసిల్దారుగా నూతనంగా విచ్చేసిన పుణ్యవతి బాధ్యతలు స్వీకరించారు. ఈమె బదిలీలో భాగంగా బుక్కరాయసముద్రం నుండి ఇక్కడికి విచ్చేశారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఓబులేసు విడపనకల్లు తాసిల్దారుగా బదిలీ అయ్యారు. డిప్యూటీ తాసిల్దార్ సూర్యనారాయణ తో పాటు కార్యాలయ సిబ్బంది పుష్ప గుచ్చములిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.
