నెల్లూరు జిల్లా,మర్రిపాడు మండల కేంద్రంలో స్థానిక సచివాలయం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ యోగ దినోత్సవ వేడుకలను ఎంపీడీవో నాగేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో సచివాలయం సెక్రటరీ సికిందర్ పర్యవేక్షణలో గ్రామ ప్రజలతో కలిసి యోగాసనాలు చేశారు. యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనం చేయుటకు ఆత్మకూరు వ్యవసాయం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు , మరిపాడు మండల టిడిపి మాజీ అధ్యక్షులు శాఖమూరి నారాయణ, మర్రిపాడు సర్పంచ్ ఎస్ కే బి జాన్ పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా యోగాసనంలో పాల్గొని యోగలో ఉన్నటువంటి పలు యాసనాలు భంగిమలు చేశారు. ప్రతిరోజు యోగా చేయడం వలన మనసు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆరోగ్యవంతులుగా ఉండుటకు దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, విద్యార్థులు, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
