అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగపు కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో కళ్ళ కు గంతలు కట్టుకుని మోకాళ్లపై కూర్చొని మున్సిపల్ కార్యాలయం ఎదుట వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జి ఒ నెంబర్ 36 ను వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రమును మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు రాజు, రామాంజనేయులు, మురళి, ఆది శేఖర్ తదితరులు పాల్గొన్నారు
