రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం మరోసారి లడ్డు వివాదంలో చిక్కుకుంది.
తాము కొనుగోలు చేసిన లడ్డూలు దుర్వాసన వస్తున్నాయనీ శుక్రవారం కొంతమంది భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు ఆలయంలోని లడ్డు విక్రయ కేంద్రానికి చేరుకొని లడ్డూలను పరిశీలించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వామివారి ప్రసాదం గా భక్తులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసి తినే లడ్డూల తయారీ పట్ల ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా లడ్డు తయారీతో పాటు విక్రయాల పట్ల అధికారులు తగిన చర్యలు తీసుకొని మంచి రుచికరమైన లడ్డూలను భక్తులకు అందజేయాలని, భక్తుల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు.