- శరణు ఘోషతో మారుమోగిన గుండ్లపల్లి గ్రామం..
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి శ్రీ రంగనాయకుల ఆలయంలో గురుస్వామి దొమ్మట భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బేతల్లి రాజేందర్ రెడ్డి స్వామి, గుండ్లపల్లి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఆదివారం మహా పడిపూజ కార్యక్రమం గురు స్వామి బాష్యం శ్రీనివాస్ చే ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్, చిగురు మామిడి, కోహెడ, గన్నేరువరం మండలాలలోని వివిధ గ్రామాల అయ్యప్పలు అధిక సంఖ్యలో తరలివచ్చి పడిపూజ లో పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో రంగనాయక ఆలయం గుండ్లపల్లి గ్రామం మార్మోగింది. అయ్యప్ప స్వాములు ఆలపించిన గీతాలతో భక్తి పారవశ్యం నెలకొన్నది. అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ , భక్తులకు సామూహిక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురు స్వామి దొమ్మాట భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బేతల్లి రాజేందర్ రెడ్డి, గుండ్లపల్లి భక్త బృందం కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన అయ్యప్ప స్వాములకు దాతలకు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అయ్యప్ప పడిపూజ నిర్వహించిన గురు స్వామి దొమ్మాట భాస్కర్ రెడ్డి, బేతల్లి రాజేందర్ రెడ్డి స్వాములను మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డబ్ల్యూ జే ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్ స్వామి గుండ్లపల్లి అయ్యప్ప స్వాములతో కలిసి ఘనంగా సన్మానించారు.










