contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కరీంనగర్ సీపీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

కరీంనగర్ జిల్లా: ​గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పటిష్ట చర్యలు చేపట్టింది. శుక్రవారం నాడు కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం, కరీంనగర్ రూరల్, హుజురాబాద్ డివిజన్ లోని ఉన్నతాధికారులు, క్లస్టర్ ఇంచార్జిలు, రూట్ ఇంచార్జులు, గ్రామ పోలీసు అధికారులందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఎన్నికల బందోబస్తు ప్రణాళిక అమలుపై స్టేషన్ హౌస్ అధికారులకు (SHOs) దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సందర్భంగా అధికారులు చేయవలసిన మరియు చేయకూడని పనుల గురించి చిన్న హ్యాండ్‌బుక్‌లెట్‌ను తయారు చేసి అందరికీ అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ బుక్‌లెట్‌లో ఎన్నికల నియమావళి మరియు భద్రతా ప్రణాళికకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా పొందుపరిచినట్లు సీపీ వెల్లడించారు.

రూట్లు, క్లస్టర్ల విభజన మరియు సిబ్బంది మోహరింపు
​కమీషనరేట్ పరిధిలోని కరీంనగర్ రూరల్, హుజురాబాద్ డివిజన్లలోని 15 పోలీసు స్టేషన్ల పరిధిని పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా విభజించారు:
​రూట్ల సంఖ్య: 104
​క్లస్టర్ల సంఖ్య: 57
​క్లస్టర్ ఇంచార్జిలు: 83 మంది అధికారులు

​గ్రామ పోలీసు అధికారులు (VPOs): క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాలు కవర్ అయ్యేలా మొత్తం 309 మందిని నియమించారు.

◆ బందోబస్తు పర్యవేక్షణ

ఎన్నికల ప్రారంభం అయ్యేవరకు క్షేత్రస్థాయిలో ​మొత్తం 508 మంది పోలీసు అధికారులు నిరంతరంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. పర్యవేక్షణ బాధ్యతలను ఉన్నతాధికారులకు అప్పగించారు:

​పర్యవేక్షణ (ఏసీపీ స్థాయి): 2 గురు ఏసీపీ స్థాయి అధికారులు
​పూర్తిస్థాయి పర్యవేక్షణ: 4 ఇన్‌స్పెక్టర్లు
​క్షేత్రస్థాయి పర్యవేక్షణ: 25 మంది ఇన్‌స్పెక్టర్లు మరియు స్టేషన్ల ఎస్సైలు

​◆ రౌడీ షీటర్లపై కఠిన చర్యలు

​శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు, కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్ల బైండోవర్‌లను పూర్తిగా పూర్తి చేశామని సీపీ తెలిపారు. వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.

​ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని సీపీ గౌష్ ఆలం గారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ , భీంరావు , ఏసీపీ లు శ్రీనివాస్ జి , వేణుగోపాల్ , వాసాల సతీష్ లతో పాటు ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు సిబ్బందిపాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :