కాగజ్నగర్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం జోనల్ స్థాయి అండర్–14 బాక్సింగ్ పోటీలను భారీగా నిర్వహించారు. ఈ పోటీలను కాగజ్నగర్ రూరల్ సీఐ కే. కుమారస్వామి, రూరల్ ఎస్ఐ సందీప్కుమార్లు ప్రారంభించారు.
పోటీల్లో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరుచారు. అండర్–14 వర్గంలో 28–30 కిలోల విభాగంలో విక్రమ్ తేజ గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందాడు. అలాగే అండర్–19 వర్గంలో సుమిత్ తివారి (63–67 కిలోలు), అంకిత్ (57–60 కిలోలు), ప్రభాత్ (69–75 కిలోలు) గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్కు ఎంపికయ్యారు.
త్వరలో వరంగల్లో జరగనున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో వీరు పోటీపడనున్నట్లు ఎస్జిఎఫ్ సెక్రటరీ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వేమూర్ల మధు, సెక్రటరీ మధురై శేఖర్, జెడ్పీఎస్ పీడీ ఇంద్ర, సీనియర్ పీడీ సంభాషరావు, సీనియర్ బాక్సర్లు సాయి, శివ, వంశీ తదితరులు పాల్గొన్నారు.
పోటీల్లో మెరిసిన యువ బాక్సర్లకు శిక్షకులు, నిర్వాహకులు అభినందనలు తెలియజేశారు.










