కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గొడుగు స్వామి యాదవ్ ఇఫ్కో నానో యూరియా ఆదర్శ రైతు పురస్కారం బుధవారం కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి చేతులమీదుగా అందుకున్నారు. తనకున్న వ్యవసాయ భూమిలో, కౌలు తీసుకున్న భూమిలో నానో యూరియా ను వరి, మొక్కజొన్న పంటలపై పిచికారి చేసి ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను ఈ అవార్డును ఇఫ్కో నానో కంపెనీ వారు ప్రధానం చేసినట్లు గన్నేరువరం మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి తెలిపారు.








