సర్కిల్ వరకు మువ్వన్నెల జాతీయ జెండా చేత పట్టుకుని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తా పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత దేశ సైన్యం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొని విజయవంతం చేసిన త్రివిధ దళాల కు దేశ ప్రజలు సైన్యానికి ఎల్లప్పుడు మద్దతుగా నిలబడతామని తెలిపారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారత ప్రభుత్వానికి దేశ ప్రజల అండదండలు ఉంటాయని తెలిపారు. తదనఅనంతరం గాంధీ సర్కిల్ వద్ద జాతీయ గీతాన్ని ఆలపించి వందేమాతరం.. వందేమాతరం.. అని నినదించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, మాకం శ్రీకాంత్, కిషోర్, మనోహర్, ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు.
