contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హైదరాబాదులో సీఐఐ ఆధ్వర్యంలో విద్య-నైపుణ్యాభివృద్ధి సదస్సు .. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో త్వరలో రూ.2 వేల కోట్ల నిధులతో 64 ఐటీఐలను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ హైదరాబాదులో సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్య-నైపుణ్యాభివృద్ధి అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని తెలిపారు. అభివృద్ధి విషయంలో తాము కూడా భేషజాలకు పోకుండా నిర్మాణాత్మకంగా కృషి చేస్తామని చెప్పారు.

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయని, ఇప్పుడెవరూ రాజకీయాలు చేయడంలేదని, తమ దృష్టి అంతా అభివృద్ధిపైనే అని అన్నారు. తెలంగాణలో విద్య, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయంలో తాము సీఐఐ భాగస్వామ్యంతో ముందుకెళతామని తెలిపారు.

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీల స్థాపన కోసం ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నది తమ విధానం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలది… ప్రజలు కోరుకుంటేనే మేం వచ్చాం అని ఉద్ఘాటించారు.

సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ 12- 12 – 2023 న నిరుద్యోగుల పై రాసిన కథనంలో  ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే వివిధ రంగాలలో లక్షల మంది తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ముందుగా మన యువతకు కావాల్సిన నైపుణ్యాలను పెంచాలి. నిరుద్యోగుల డేటా ను సేకరించాలి. శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి. శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు సరిఫికేట్లు ఇవ్వాలి. కార్మిక శాఖలో ప్రతి కంపనీ యొక్క డేటా ఉండాలి. ఒక సాఫ్ట్వేర్ ద్వారా కంపెనీ మరియు నిరుద్యోగ యువత డేటా ని కంప్యూటర్లో నమోదు చేయాలి . నిరుపయోగంగా ఉన్న కార్మిక శాఖని వినూత్న రీతిలో కొన్ని మార్పులు జరిపి పునఃప్రారంభించాలని ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :