contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మానకొండూర్ నియోజకవర్గంలో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైన కాంగ్రెస్ శ్రేణులు

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్స్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి కార్యదర్శి,కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు క్రిస్టోఫర్ తిలక్ తో పాటు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్,పీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ తో పాటు రాష్ట్ర జిల్లా నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త 100రోజులు అహర్నిశలు కష్టపడాలని కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో రాష్ట్రంలో అధికారానికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కష్టపడాలని వారు అన్నారు,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు చెబుతూ ప్రజలను చైతన్య పరచాలని బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో పేద ప్రజలకు న్యాయం జరగలేదని బిఆర్ఎస్ బిజెపి రెండు ఒకటేనని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :