contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాసిల్దార్ పై కేసు నమోదు….

వందల కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ విక్రయించినందుకు మహేశ్వరం మాజీ తాసిల్దార్ ఆర్ పి. జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టర్, , ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డి పై కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ వీడియో నెంబర్ 83/2023 కింద కేసు నమోదు అయింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వేనెంబర్ 181లో 42 ఎకరాల ప్రభుత్వ భూమిని మహేశ్వరం మాజీ తాసిల్దార్ జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ , ఈఐపిల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డికి అప్పనంగా అందజేశారు. ఈ విషయమై దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా XVII అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు మహేశ్వరం సిఐ మధుసూదన్ సెక్షన్ 420, 166 కింద తాసిల్దార్ జ్యోతి సబ్ రిజిస్టర్ ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు తో పాటు తెలంగాణ హైకోర్టు WP37146/2022 ద్వారా విచారణ కూడా కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా భూముల విషయమై సాక్షాత్తు తాసిల్దార్ పై కేసు నమోదు కావడం తెలంగాణలో ఇది మొట్టమొదటిసారి కావడం విశేషం. మహేశ్వరం పోలీసులు మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు. భూవాదాలు కోర్టులో ఉన్నందువల్ల తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాసిల్దార్ మహ్మద్ అలీ మాట్లాడుతూ. నాగారం లోని సర్వే నెంబర్ 181 విషయం తమ దృష్టికి వచ్చిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని తెలిపారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :