contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గురజాల సిఐ ప్రభాకర్ నోటి దురుసు .. సిఐ పై ఎమ్మెల్యే కి ఫిర్యాదు

పల్నాడు జిల్లా గురజాల పట్టణం 13 , 14 వార్డుల్లో బుధవారం గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డ ఇంటింటికి తిరుగుతున్న సమయం లో ముస్లిం మహిళలు గురజాల సిఐ ప్రభాకర్ పై ఫిర్యాదు చేసారు . జులై 16 వ తేదీన గురజాల మదార్సా పాఠశాలలో కలుషిత ఆహరం తిని నకారికల్ మండలం గుల్లపల్లి గ్రామానికి చెందిన రంజాన్ వలి కుమారుడు మున్నా మృతి చెందాడు . ఈ ఘటన పై మున్నా తల్లిదండ్రులు రంజాన్ , ఫాతిమా లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ కేసు దర్యాప్తు పై అడిగేందుకు ఈ నెల 3 తేదీ అనగా బుధవారం సిఐ ప్రభాకర్ కలిశారు . సిఐ ప్రభాకర్ స్పందిస్తూ మీరు ఎందుకు వచ్చారు … డబ్బుకోసమేగా .. నేను ఇలాంటి కేసులు ఎన్నో చూసాను .. అంటూ దురుసుగా నోటికొచ్చినట్టు మాట్లాడడం తో తీవ్ర ఆవేదనకు గురైన మున్నా తల్లిదండ్రులు కాసు మహేష్ రెడ్డి కి ఫిర్యాదు చేయడం జరిగింది. స్పందించినా మహేష్ రెడ్డి ఈ కేసు ను త్వరగా దర్యాప్తు చేయాలనీ డిఎస్పీ జయరాంని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :