contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Ichhapuram :వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం : ఇచ్చాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి ప్రతి రాజేష్ దాసన్నపేటలోని తన నివాసంలో (49) ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఎక్కువ జామున రాజేష్ ఎంతకీ తలుపు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బలవంతంగా తెరిచి చూడగా రాజేష్ ఫ్యాన్ కు వేలాడుతూ విగత జీవుడై కనిపించాడు. చాలాకాలంగా పత్తి రాజేష్ అతని భార్య మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. పోలీసులు కూడా ఇప్పటికే పలుమార్లు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. అయితే ఈలోగా ప్రత్తి రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. షర్టు చేతులపై, ప్యాంటుపై రక్తపు మరకలు ఉండడంతో పలువురు అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజేష్ మృతుని అనుమానాస్పద మృతి గానే కేసు నమోదు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ కే గోవిందరావు తెలిపారు. ప్రత్తి రాజేష్ ఇచ్చాపురం పట్టణ ప్రజలందరికీ చాలా సుపరిచితుడు. అందరితో ఎంతో ఆత్మీయంగా మెలిగేవాడు. సామాజిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుండేవాడు. సహాయం కోసం అర్థించిన వారికి కాదనకుండా సహాయం చేసేవాడు. అటువంటి వ్యక్తి మృతితో ఇచ్చాపురం పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :