contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శభాష్ కడప పోలీస్ …

 

  •  శభాష్ కడప పోలీస్ …
  •  ఎం.ఎల్.సి ఎన్నికల్లో మానవత్వం చాటిన తలమంచి పట్నం మహిళా కానిస్టేబుల్ సుజిత..

వై.ఎస్.ఆర్ జిల్లా: ఎం.ఎల్.సి ఎన్నికల పోలింగ్ లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. జమ్మలమడుగు రూరల్ పరిధిలోని తలమంచి పట్నం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ సుజిత ( డబ్ల్యూ.పి.సి 2152) పెద్ద ముడియం గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్ లో ఎన్నికల విధులు కేటాయించారు. ఆసందర్భంగా ఓ మహిళ మూడు నెలల పసికందును తన వెంట ఎత్తుకొచ్చింది. ఓటు వేసేందుకు తల్లి వెళ్లడంతో చిన్నారి ఏడ్చింది. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుజిత ఆ చిన్నారిని ఎత్తుకుని లాలించి పోరు మాన్పించింది. మానవత్వంగా వ్యవహరించిన ఆ మహిళా కానిస్టేబుల్ ను చిన్నారి తల్లితో పాటు ఆ లొకేషన్ పరిసరాలలో ఉన్న ఓటర్లు, సిబ్బంది అభినందించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ IPS గారు మహిళా కానిస్టేబుల్ సుజిత సేవలను ప్రశంసించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :