కరీంనగర్ జిల్లా: గంగాధర పోలీస్ స్టేషన్ ఎస్సై జి వంశీకృష్ణ శుక్రవారం రోజున బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలోని వివిధ సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకెళ్తానని ముఖ్యంగా మాదకద్రవ్యాలపై దృష్టి పెట్టి మండల ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజల మన్ననలను పొందుతానని మరి ముఖ్యంగా వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకొని పరిష్కారం చేసుకోగలరని ఎలాంటి సిఫారసులకు తావు లేకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేశారు.
