- ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్ఐ నరేష్
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో మూడు రోజులపాటు జరిగే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం, శకటోత్సవం, రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు, శుక్రవారం నరసింహుని స్థానాచార్యులు అర్చకులు పరాంకుశం యాదగిరి చార్యులు, వెంకటనారాయణ ప్రదీప్ చార్యులు, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి పల్లకి సేవలో తీసుకవెళ్లి ఆది నరసింహస్వామి దేవాలయ క్షేత్రంలో వేద పండితులు మణిశంకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణం జరిపించారు, అర్చకులు మణిశంకర్ శర్మ మాట్లాడుతూ శనివారం సాయంత్రం శకటోత్సవం, ఆదివారం ఉదయం రథోత్సవం జరుగుతుందని తెలిపారు, ఆది నరసింహస్వామి ఆలయం వద్ద శకటోత్సవం జరిగే ప్రదేశాన్ని ఎస్సై తాండ్ర నరేష్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు, కళ్యాణోత్సవంలో ప్రజా ప్రతినిధులు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.