కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: అలుగునూర్ వంతెనపై పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పలువురు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు గౌడ సంఘాల నాయకులు బహుజన సంఘాల నాయకులు. అనంతరం కరీంనగర్ కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో మొదటగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలు జ్యోతి ప్రజ్వలన చేసి పాపన్న చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గోపి,ఆడిషినల్ కలెక్టర్, కరీంనగర్ ఆర్డీవో, ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు గౌడ సంఘాల నాయకులు బహుజన సంఘాల నాయకులు హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గీతాకార్మికుల సంక్షేమానికి ఎన్నో సంక్షేమాలు చేపడుతున్నారని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తగా సర్వాయిపాపన్న జయంతి వర్దంతి అధికారికంగా నిర్వహించటం తో పాటు పాపన్న ఆశయం వైపు ప్రయాణించాలన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, జిల్లా కలెక్టర్ పీ.గోపి, అడిషనల్ కలెక్టర్,కరీంనగర్ ఆర్డీవో, కరీంనగర్ మెయర్ వై.సునీల్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ పొన్నం అనిల్ గౌడ్, సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్, కరీంనగర్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమశాఖ అధికారి రాజ్ మనోహర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భముగా సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు జక్కే. వీరస్వామిగౌడ్ మాట్లాడుతు సమైక్య రాష్ట్రంలో పాపన్న చరిత్ర గుర్తింపుకు నోచుకోలేదని 350 ఏళ్ల క్రితమే అణగారిన వర్గాలకు రాజ్యకాంక్ష రుచి చూపించిన వితోచిత పోరాట యోధుడని సమైక్య పాలకులు చరిత్రని తొక్కిపెట్టాలని చూశారని కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్టంలో పాపన్నకు మంచి గౌరవ దక్కిందని వీరస్వామి గౌడ్ అన్నారు. ప్రభుత్వం అధికారికంగా చేయటమే గౌడ సోదరులకు బహుజనులకు గర్వంగా ఉందని ఈ సందర్భముగా రాష్ట ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రులు శ్రీనివాస్ గౌడ్ కి గంగుల కమలాకర్ కి గౌడ సోదరుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని వీరస్వామిగౌడ్ అన్నారు. పాపన్న కోటలు శిథిలావస్థకు చేరాయని వాటిని రక్షించి భవిష్యత్ తరాలు పర్యాటకులు వీక్షించే విదంగా చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘము నాయకులు కలర్ సత్తన్న గౌడ్, సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము జిల్లా అధ్యక్షులు గణపతిరాజ్ గౌడ్, మహిళ జిల్లా అధ్యక్షురాలు వడ్లకొండ అరుణ గౌడ్, సంఘము జిల్లా నాయకులు బుర్ర హరీష్ గౌడ్,మహిళ నాయకులు పడాల సౌజన్యగౌడ్,గుర్రం రచనగౌడ్, గుర్రం రవళిగౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు గౌడసంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు బహుజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.