దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ లపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడని అన్నారు. తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లతో సహా పలువురు పోలీస్ అధికారులను జగన్ జైలు పాలు చెయ్యబోతున్నాడని చెప్పారు. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు.
41ఏ నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ అంకంబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సీఐడీ అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పారు. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారుల తీరు మారడం లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడు. తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లతో సహా పలువురు పోలీస్ అధికారులను జైలు పాలు చెయ్యబోతున్నాడు జగన్ రెడ్డి. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారు.(1/3) pic.twitter.com/nDekyuyQHK
— Lokesh Nara (@naralokesh) September 24, 2022