జమ్మూకశ్మీర్: పహల్గామ్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా వాసి మృతి చెందారు. మృతుడిని కావలికి చెందిన మధుసూదన్రావుగా గుర్తించారు. ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది.
మధుసూదన్రావు కుటుంబం అక్కడే స్థిరపడింది. పహల్గామ్కు విహారయాత్రకు వెళ్లగా నిన్న జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబం పహల్గామ్ బయలుదేరి వెళ్లిందని సమాచారం. ఇక, ఇదే దాడిలో విశాఖపట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి కూడా మృతి చెందారు.