contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తల్లిదండ్రులకు దూరమైన ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా తల్లికి అప్పగించిన : ఎస్సై నాగమంజుల

పాకాల : విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించిన పాకాల పోలీసులు దారి తప్పి తల్లిదండ్రులకు దూరమైన ఇద్దరు బాలురను గుర్తించి, సురక్షితంగా వారి తల్లి చెంతకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పాకాల మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్ నాగమంజుల సమయస్ఫూర్తితో స్పందించి ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు.

పాకాల బస్టాండ్ ఆవరణలో శాంతిభద్రతల తనిఖీలు, గస్తీ నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ నాగమంజుల ఒంటరిగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు బాలురను గమనించారు. వారిని పిలిచి వివరాలు అడిగి తెలుసుకోగా, వారు పి. యాజ్ఞేష్ (13), తండ్రి పి. జగదీష్, పి. లక్ష్మీపతి (13), తండ్రి పి. పుష్పరాజ్ అని, ఇద్దరూ ఉగ్రణంపల్లి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. వీరు పెనుమూరు మండలం, శాతంబాకం పంచాయతీ పరిధిలోని పెద్దరాజుపల్లి గ్రామానికి చెందిన వారని గుర్తించారు.

బాలురు దారి తప్పి పాకాల బస్టాండ్‌కు చేరుకున్నట్లు తెలుసుకున్న ఎస్‌ఐ నాగమంజుల వెంటనే వారికి ధైర్యం చెప్పి, కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. అనంతరం బాలుర తల్లికి సమాచారం అందించి పాకాల బస్టాండ్‌కు రప్పించారు. అవసరమైన విచారణ అనంతరం ఇద్దరు బాలురను క్షేమంగా వారి తల్లికి అప్పగించారు.

ఈ ఘటనలో పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న చిన్నారులను గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు చేర్చడం ద్వారా తమ సామాజిక బాధ్యతను, సేవా తత్పరతను చాటుకున్నారని స్థానికులు, ప్రయాణికులు ప్రశంసించారు.

సమయానుకూలంగా స్పందించి బాలురను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు చేర్చిన మహిళా ఎస్‌ఐ నాగమంజుల, పాకాల పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :