పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్ వద్ద భారీగా మద్యం అధికార్లు పట్టుకున్నారు. పరిమితికి మించి తరలిస్తున్న 1050 మద్యం క్వార్టర్ సీసాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ మరియు పిడుగురాళ్ల సేబ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. సుమారు వాటి విలువ 2 లక్షల ఉంటుందని సేబ్ అధికారులు తెలిపారు. మద్యం సీసాలను రెస్టారెంట్ లో కాకుండా ఇతర వ్యాపారస్తులకు సరఫరా చేస్తున్నట్టు సమాచారం అందడంతో సేబ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు దాడి చేసి మద్యాన్ని సిజ్ చేసారు. మద్యం తరలిస్తున్న కారును, ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకీ తీసుకున్నారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)