నిజామాబాద్ జిల్లా : నందిపేట్ మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ ముందట 16వ రోజుకు చేరిన ఐకెపి విఓఏల ఉద్యోగుల ధర్నా ఐకెపి విఓఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఐకెపి అధ్యక్షురాలు సుజాత, ఉపాధ్యక్షురాలు మీనా వారు మాట్లాడుతూ ,నందిపేట్ మండల కేంద్రంలో,ఐకెపి విఓఏల సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం 18,000/ వేతనం ఇవ్వాలి కోరారు, 10 లక్షల సాధన బీమా ఆరోగ్య భీమా కల్పించాలన సెల్ఫ్ ఐడి కార్డులు ఇవ్వాలని తదితర సమస్యలను పరిష్కరించాలని అనేకసార్లు తెలంగాణ ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లిన కనీసం ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో విఓఏల కోరికల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్నా విఓఏల అందరూ 24 ఏప్రిల్- 2023 నిరవధిక నిర్వహించడం జరిగింది,
విఓఏల డిమాండ్లు:–
1) విఓఏల కనీస గౌరవ వేతనం 18,000 అమలు చెయ్యాలి,
2) విఓఏల కు పది లక్షల సాధారణ భీమా మరియు ఆరోగ్య భీమా కల్పించాలి,
3) విఓఏల కు గౌరవ వేతనం డి ఆర్ డి ఎ శాఖ యొక్క అకౌంట్ నుండి నేరుగా విఓఏల అకౌంట్లో జమ చేయాలి,
4) జీవో నెంబర్ 58 సవరిస్తూ అనుబంధం 5 నువ్వు రద్దు చేసి మూడు సంవత్సరాల ఒకసారి పునరుద్ధరణ రినీవల్ చేయాలి,
5)విఓఏల కు శ్రీనిధి నుండి ఇన్సిటివ్ రద్దు చేయాలి,
6)విఓఏల కు సెర్స్ నుండి ఐడి కార్డులు ఇప్పించాలి,
7)విఓఏలను సెర్స్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి,
8)విఓఏల కు అర్హత కలిగిన వారికి సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలి,
9)విఓఏల కు జాబ్ చాట్ డిక్లరేషన్ చేయాలి,
10)విఓఏల కు డ్రెస్ కోడ్ ఇవ్వాలి,
విఓఏ ల డిమాండ్లను నెరవేర్చాలని కోరడం జరిగింది, సమ్మె 16వ రోజుకు చేరిన తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరిత్తినట్లు వివరిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు, అదేవిధంగా విఓఏ ల రోడ్డుపై వంటావార్పుతో నిరసన తెలిపారు, ఇంత జరిగిన గాని రాష్ట్ర ప్రభుత్వము స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని కొనియాడారు, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలని కోరారు, ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సుజాత ,ఉపాధ్యక్షురాలు మీనా, కార్యదర్శి సాయన్న, కోశాధికారి స్వప్న, సహాయ కార్యదర్శి పావని, తదితరులు పాల్గొన్నారు