సిద్దిపేట జిల్లా: కరీంనగర్ పట్టణం రాంనగర్ ప్రాంతానికి చెందిన రత్నం తన భార్య కొడుకు కూతురుతో కలిసి తన సొంత కారులో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అచ్చంపేట గ్రామానికి తన బంధువుల శుభకార్యానికి బయలుదేరారు . సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన బుర్ర నిశాంత్ (22) అనే వ్యక్తి కార్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. డ్రైవర్ గా నిశాంత్ ను తీసుకెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హైవేలో డివైడర్ కు ఢీకొని కార్ డ్రైవర్ బుర్ర నిశాంత్ అక్కడికక్కడ మృతి చెందాడు. శనివారం రాత్రి 8 గంటలకు కరీంనగర్ నుండి బయలుదేరి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లేసరికి 3:30 కి డ్రైవర్ కి నిద్రమత్తులో హైవే లో డివైడర్ కి ఢీకొని కారు పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న రత్నం భార్య కి చేతి ఫ్యాక్చర్ కాగా కుమారునికి కూతురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తాడేపల్లిగూడెం ఎస్సై విఎస్వి భద్రరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బుర్ర నిశాంత్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా బేగంపేటలో కుటుంబ సభ్యులు స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు.