contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో గల భూముల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 400 ఎకరాల భూములను పరిరక్షించాలంటూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో సైతం లేవనెత్తారు.

కంచ గచ్చిబౌలి భూములపై వాస్తవ నివేదికను పంపాల్సిందిగా తెలంగాణ అటవీ శాఖను తాజాగా కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.

ఈ నేపథ్యంలో న్యాయస్థానాల తీర్పులను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని, అటవీ చట్టాలకు లోబడి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని ఈ భూమికి సంబంధించిన వాస్తవ నివేదిక వివరాలను, తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని కేంద్రం పేర్కొంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :