నిజామాబాద్ : సమాచార హక్కు చట్టం 20. 05 పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని ఏమాత్రం గౌరవించట్లేదని సమాచార హక్కు చట్టం ఈ దేశ ప్రజలకు సామాన్యులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు సైతం తమ ఇష్టానుసారంగా వారికి అడ్డు అదుపు లేకుండా అక్రమాలకు అన్యాయాలకు తెగబడుతున్నారని సమాచార హక్కు చట్టం 2005 పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం అన్నారు.
గురువారం నాడు స్థానిక ప్రెస్ అప్ నందు విలేకరు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సమాచార హక్కు 2005 పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ని నూతన కార్యవర్గము సన్మానించి సత్కరించింది. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా ఆదె ప్రవీణ్ కుమార్ ,మహిళా అధ్యక్షులుగా స్వప్న , నగర అధ్యక్షులుగా కోతిమీర స్వామి మరియు కార్యవర్గ సభ్యుల్ని ప్రకటించడం జరిగింది. దీనికి రాష్ట్ర పరిశీలకులుగా డాక్టర్ హనుమాన్లు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా వివిధ శాఖలకు సంబంధించిన సమాచార హక్కు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరము నూతన కార్యవర్గాన్ని సన్మానించి సత్కరించడం జరిగింది.