మాచర్ల పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఇండియన్ స్వచ్ఛత లీగ్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఇ.వి రమణ బాబు మాట్లాడుతూ పిల్లలకు పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకం నిర్మూలన, దోమల నివారణ, మొక్కల పెంపకం, ఫ్రైడే డ్రై డే, వ్యక్తిగత పరిశుభ్రత, క్లీన్ మాచర్ల – గ్రీన్ మాచర్ల మూవ్ మెంట్ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)