- ఉపాధ్యాయులను సన్మానించిన మంత్రి గంగుల, ఎమ్మెల్యే డా.రసమయి
కరీంనగర్ జిల్లా:ది రిపోర్టర్ టీవీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటరియంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి వర్యులు గంగుల కమలాకర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ ఎమ్మెల్యే డా.శ్రీ.రసమయి బాలకిషన్ హాజరై ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గోపి, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.