ప్రముఖ సంఘ సేవకుడు, బీజేపీ నేత, సామాజిక వెత్త, కేజేఆర్ ఆనంద్ క్రృష్ణారెడ్డి 59 జీఓ దరఖాస్తుదారుల కు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా బొల్లారం పేద ప్రజలు 59 జీవోకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాని గురించి అధికారులు విచారణ కు వస్తున్నారు కాకపోతే ఏ రోజు మా ఇంటికి వస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు .దీనివల్ల ప్రజలకు అంతరాయం జరుగుతుంది డ్యూటీకి వెళ్లకుండా నాలుగు రోజులు నుంచి ఇంటికాడ వెయిట్ చేస్తున్నారు అప్లికేషన్ చాలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ ఎవరి ఇంటికి వస్తారో తెలియదు కాకపోతే మన అధికారులకి ఎవరైతే బాధితుడు ఉన్నారో వాళ్లకి ఫోన్ చేసి మేం ఫలానా రోజు మేము వస్తున్నాము ఎక్కడ పోవద్దు అని చెప్తే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. కలెక్టర్ గారు మీరు పేదల పక్ష అధికారని మాకు తెలిసింది దయచేసి దరఖాస్తు దారులు కు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి బిజెపి నాయకుడు కోరారు