- ప్రజా చైతన్య యాత్ర బహిరంగ సభలో సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి …
- సిపిఐ ప్రజా చైతన్య యాత్ర మండలంలో విజయవంతం
- సిపిఐ ప్రజా చైతన్యత బృందానికి ఘన స్వాగతం …
గ్రామ గ్రామం నుండి భారీగా తరలివచ్చిన సిపిఐ కార్యకర్తలు అభిమానులు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: చాడకు ప్రజల పుష్పాభిషేకం.
ఈనెల 15వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు బిజెపిని గద్దె దించండి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో సిపిఐ జాతీయ పార్టీ పిలుపుమేరకు తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర కరీంనగర్ జిల్లా మీదుగా గన్నేరువరం మండలం కు గురువారం చేరుకుంది. ఈ నేపథ్యంలో గన్నేరువరం సిపిఐ మండల సమితి ప్రజా చైతన్య యాత్ర చాడ బృందానికి కార్యకర్తలు ప్రజలు మహిళలు పూల వర్షం కురిపించారు. మంగళహారతులతో డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహం నుండి పాదయాత్రగా గన్నేరువరం బస్టాండ్ వరకు చేరుకున్నారు, అంతకుముందు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇందుర్తి మాజీ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు, అనంతరం బస్టాండ్ ఆవరణలో కాంతాల అంజిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు గడపగడపకు సిపిఐ నినాదంతో ప్రజా చైతన్య యాత్ర బయలుదేరిందని పేర్కొన్నారు, దీనిలో భాగంగా ప్రతి గ్రామాన ప్రజలను పాలకుల వైఫల్యాలు నెత్తి చూపుతూ ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటీకరణ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. నిత్యవసర వస్తువులు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ధరలు, అందుబాటులో లేవని ప్రజలు పూటగడవని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు, దీనివల్ల ఆర్థిక భారంతో మధ్య సామాన్య పేద ప్రజలు అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న దృశ్య ప్రభుత్వాలు ప్రజలను విస్మరించి బడా బాబుల జేబులోని రింపుతున్నారని పేర్కొన్నారు, ప్రజలకు అన్ని సౌకర్యాలుకల్పించవలసిన ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రభుత్వాల మెడలు వంచడానికి ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వ భూములను కార్పోరేట్ మయం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు, మోడీ సర్కార్ రైతు వ్యతిరేక సత్యాన్ని ప్రవేశపెట్టి 750 మంది రైతులు చనిపోవడానికి కారకులయ్యారని ఆవేదన చెందారు దేశాన్ని మోడీ సర్కార్ బ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యపట్టారు, ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో నాయకులు వీరమరణం పొందిఅలాగే మరి కొంత మంది,ఉరి కంభం ఎక్కారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిపిఐ పార్టీ ఉద్యమ పోరాట ఫలితంగానే వారు చిందించిన రక్తతర్పానంతో తెలంగాణ రాష్ట్రం, సిద్ధించిందని అన్నారు, ప్రజల పక్షాన ప్రజా సమస్యల గురించి ప్రజల వెంటుండి ప్రజల కోసం నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఏకైక పార్టీ సిపిఐ అని పేర్కొన్నారు. నేడు ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలను మంటగల్పుతున్నాయని ఆయన తెలిపారు. త్రాగునీరు సాగునీరు కోసం పేద ప్రజలకు పోరాటం చేసి భూ పంపిణీ కార్యక్రమం సిపిఐ పార్టీ చేపట్టిందని అలాగే ఈ ప్రాంత రైతాంగానికి వరద కాలువల,ద్వారా నిర్మించాలని ఉద్దేశంతో మిడ్ మానేరు నిర్మాణానికి సిపిఐ పార్టీ ఉద్యమాల ద్వారా జీవం పోసింది అని తెలిపారు, ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని అలాగే రేషన్ కార్డులు లేనివారికి రేషన్ కార్డులు అందించాలని 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని నిత్యవసర వస్తువుల ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. పాలకుల పనితీరును ఎండకట్టుటకు ప్రజలు చైతన్యపరిచే దిశగా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా చైతన్య బాట పట్టిందని ఆయన అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ నిప్పులాంటిదని ప్రజల పక్షాన ఉండి స్వచ్ఛమైన నీతివంతమైన పాలన అందించే వరకు ప్రజలతో ఉంటూ ప్రజా పోరాటాలు చేస్తుందని వెల్లడించారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం మూడు లక్షలు సరిపోవు కనుక ఐదు లక్షల రూపాయల వరకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, నల్లదానాన్ని వెలికి తీసి ప్రతి పౌరుని అక్క ఒంట్లో 15 లక్షల డబ్బులు వేస్తావ్ అన్న మోడీ మాట తప్పని అని తెలిపారు, సిపిఐ దేశంలో బిజెపిని వామపక్షాలతో కలిపి గద్దె దించేంతవరకు పోరాటాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణు శంకర్, మణికంఠ రెడ్డి ఏఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్,సీపీఐ జిల్లా నాయకులు న్యాలపట్ల రాజు,ఏ.ఐ.వై.ఎఫ్ బోనగిరి మహేందర్,బోయిని మల్లయ్య, గన్నేరువరం సహాయ కార్యదర్శి శ్రీశైలం, ములుగురి సంపత్, ములుగురి అంజనేయులు, కూన మల్లయ్య, ఘర్షకుర్తి శ్రీనివాస్, పబ్బతి సాగర్ రెడ్డి, జాలి గోపయ్య, బుర్ర శ్రీనివాస్, మూడుకే లచ్చయ్య, కొండాపూర్ అనిల్, జంగపల్లి సంపత్ సిపిఐ నాయకులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.