- మహిళలను వేధిస్తున్న బీజేపీ నాయకులను కాపాడుతున్న మోడీ
- బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది
- డబ్ల్యూ ఎఫ్ ఐ అధ్యక్షుడు పదవి నుంచి బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తక్షణమే తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
- రెజ్లర్ల ఆందోళనకు PDM, MCPI, CPI , RTI తదితర ప్రజాసంఘాలు సంఘీభావం .
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల : క్రీడా కారుల పట్ల లైంగిక వేదిపుల కు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేయాలని జంతర్ మంతర్ లో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా క్రీడా కారులు పట్ల పోలీసులు లాఠీ చార్జి కి పాల్పడడం సిగ్గు చేటు అని పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు అన్నారు.
ఒక ప్రక్క బేటి పడావో బేటి బచావో అని అంటూ పాలనలో చూస్తే మహిళలకి రక్షణ కల్పించడం లో చిత్తశుద్ది చూపించడం లేదని, కుస్తీ పోటీలలో మల్లయోధులు గా దృఢంగా వున్న రెజ్లిస్ మహిళల కే రక్షణ లేకపోతే ఇక సాధారణ మహిళలకు రక్షణ ఎలా ఉంటుందిఅని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఢిల్లీ పురవీధుల్లో దాదాపు నాలుగు నెలల నుంచి రెజ్లర్స్ మహిళలపై లైంగిక వేధింపులు గురిచేస్తున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ వలన లైంగిక వేధింపులకు గురయ్యామని ఫిర్యాదు చేసి అనేక రూపాలలో ఆందోళనలు చేస్తూ చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్న వారి కంప్లైంట్ పై ఎటువంటి చర్యలు తీసుకో లేదని,మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్తున్న బిజెపి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది, బిల్కిస్ భాను కేసులో దోషుల్ని బయటికి తీసుకొచ్చి దండలు వేసి సత్కరించారు,హ త్రాస్ కేసులో దోషులకు శిక్ష పడకుండా చేశారు, ఉన్నావ్ ఘటన లో దోషులకు అండగా నిలిచారు, మహిళలపై అత్యాచారాలు జరిగిన పలు చోట్ల కారకులు బిజెపి వారు అని తెలిసి కూడా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దోషులను శిక్షించటానికి ప్రయత్నాలు చేయడంలో చిత్త శుద్ది లేదని తేటతెల్లమైన సంఘటనలు అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయన్నారు. దేశం కోసం మల్ల హొదులు జాతీయ, అంతర్జాతీయ పతకాలు అవార్డులు గెలుచుకున్న యువతులు కష్టంతో చెమట చిందించి అనేక సందర్భాల్లో, మన జాతీయ జెండాను గర్వంగా ఎగురవేసి ఉన్నతంగా నిలిపి దేశానికి కీర్తిని తెచ్చిన ఈ యువ ఔత్సాహిక మహిళల విజయాలను యావత్ భారతదేశం వారిదిగా నిలిచారన్నారు.తమపై ఎంపీ.మరియు జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ శరణ్ సింగ్ దేశ విదేశాల గడ్డ మీద లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు అని అనేకమంది పిర్యాదులు చేసినా,ఫిర్యాదుదారుల్లో ఒక మైనర్ కూడా ఉన్నపటికీ పోలీసులు కేసు నమోదు చేసి నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుంది అని అరెస్టు చేయకుండా న్యాయ చేయడం లో విఫలమైయ్యారన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. అమిత్ షా దగ్గర నుంచి అందరూ అతనికి సపోర్ట్ చేస్తానే ఉన్నారు క్రీడా సంస్థలో ఉన్న వారందరూ హైయర్ పొజిషన్లో ఉండి ఈ రకంగా మహిళలపై అన్యాయం జరిగిన పట్టించుకోరు లైంగిక వేధింపులు జరిగినా పట్టించుకోరని ఏద్దేవా చేసారు. బీసీసీఐకి అమిత్ షా కొడుకు అధ్యక్షుడిగా ఉన్నాడు ఇది కూడా గమనించాలి వీరంతా కలిసి మహిళలపై ముకుమ్మడి దాడి చేస్తా ఉంటే పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందని మహిళలకు రక్షణ కల్పించలేదా.? ఇదేనా బిజెపి పరిపాలనలో మహిళలకి రక్షణ అని అన్నారు అభియోగాలు తీవ్రమైనవి కాబట్టి న్యాయం చేయడానికి తక్షణ చర్యలు అవసరమని బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలనీ, ఆలస్యం చేయకుండా బ్రిజ్ భూషణ్ను కటకటాల వెనక్కి నెట్టాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.